జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-25T09:46:36+05:30 IST
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్యవినాయకనగర్కు చెందిన గోపితో భార్య గొడవపడి ఏడాది క్రితం కుమారుడిని తీసుకుని, పుట్టింటికి వెళ్లింది.
హిందూపురం టౌన్, సెప్టెంబరు 24: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్యవినాయకనగర్కు చెందిన గోపితో భార్య గొడవపడి ఏడాది క్రితం కుమారుడిని తీసుకుని, పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి గోపి దోభీ పనిచేసుకుంటూ ఒంటరిగా జీవిస్తుండేవాడు.
దీంతో జీవితంపై విరక్తిచెంది, కిరికెర సమీపంలో చెట్టుకు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.