-
-
Home » Andhra Pradesh » Ananthapuram » atp carona
-
కరోనా కేసులు 29
ABN , First Publish Date - 2020-12-06T06:11:38+05:30 IST
జిల్లాలో శనివారం 29 కరోనా కేసులు నమోదయ్యాయి.

అనంతపురం వైద్యం, డిసెంబరు 5: జిల్లాలో శనివారం 29 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అనంతపురం నగరంలో 10, బొమ్మనహాళ్, తనకల్లు 4, ధర్మవరం, శింగనమల 2, కదిరి, కూడేరు, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, రొద్దం, తాడిపత్రి మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. అధికారిక బులిటెన్ ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 66825 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 592 మంది మరణించారు. 66042 మంది ఆరో గ్యంగా కోలుకోగా 191 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఎవరూ మరణించలేదు.