10 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-25T06:41:42+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 కేసులు మాత్రమే నమోదైనట్లు మం గళవారం అధికారులు ప్రకటించారు.

10 మందికి కరోనా

అనంతపురం వైద్యం, నవంబరు 24: జిల్లాలో కరోనా కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 కేసులు మాత్రమే నమోదైనట్లు మం గళవారం అధికారులు ప్రకటించారు. 7 మండలాల్లో కొత్త కేసులు రాగా... అందు లో హిందూపురంలో 4, బొమ్మనహాళ్‌, ధర్మవరం, గోరంట్ల, మడకశిర, నల్లమాడ, పుట్టపర్తి మండలాల్లో ఒక్కో కేసు నమోదైంది. కరోనాతో ఎవరూ మరణించలేదు. దీంతో మొ త్తం బాధితుల సంఖ్య 66503కి చేరింది. ఇందులో 587 మంది మరణించారు. 65590 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 326 మంది చికిత్స పొందుతున్నట్లు అధి కారులు వెల్లడించారు.

Updated Date - 2020-11-25T06:41:42+05:30 IST