కాలిన మహిళ శవం లభ్యం
ABN , First Publish Date - 2020-10-19T09:30:31+05:30 IST
కాలిన మహిళ శవం లభ్యం

శింగనమల, అక్టోబరు 18 : మండలంలోని నాయన పల్లి క్రాస్ వద్ద ఆదివారం కాలిన మహిళా శవం లభ్య మైంది. ఆ మృతదేహం పెద్దపప్పూరు మండలం నారాపు రం గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ(54)గా పోలీసులు గుర్తించారు. నారాపురానికి చెందిన లక్ష్మీనరసమ్మకు పామి డి మండలం గాజులపాళ్యానికి చెందిన రాముడితో వివా హమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల కు మారుడు మృతి చెందాడు. 30 ఏళ్ల కిందట భర్తతో మనస్పర్థలు రావడంతో లక్ష్మీనరసమ్మ స్వగ్రామమైన నా రాపురంలోని తన సోదరుడి ఇంటికి వచ్చి ఉంటోంది. లక్ష్మీ నరసమ్మ పేరుమీద ఆమె మామ రెండెకరాల భూమిని రాసిచ్చారు. మూడ్రోజుల కిందట రాముడు కాపురానికి రావాలంటూ గ్రామానికి వచ్చి లక్ష్మీనరసమ్మను తీసు కెళ్లాడు. అప్పటి నుంచి లక్ష్మీనరసమ్మ కనిపించకపోవ డంతో భర్తే ఏమో చేశాడని ఆమె అన్న పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రాము డును అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది.