అనంతలో 59 మంది ఉపాధ్యాయులు, 18 విద్యార్థులకు కరోనా
ABN , First Publish Date - 2020-11-06T12:31:57+05:30 IST
రాష్ట్రంలో స్కూల్ పున:ప్రారంభంతో అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు.
![అనంతలో 59 మంది ఉపాధ్యాయులు, 18 విద్యార్థులకు కరోనా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110606584763/11062020070150n38.jpg)
అనంతపురం: రాష్ట్రంలో స్కూల్ పున:ప్రారంభంతో అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా అనంతలో 59 మంది ఉపాధ్యాయులు, 18 విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 16736 మంది ఉపాధ్యాయుల్లో 14424 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... వారిలో 59 మంది ఉపాద్యాయులకు పాజిటివ్గా అని తేలింది. అలాగే 1212 మంది విద్యార్థినీ విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయగా...18 మంది కరోనా బారిన పడినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.