అంబులెన్స్ సీజ్
ABN , First Publish Date - 2020-03-28T09:10:15+05:30 IST
మండలంలోని కాశేపల్లి టోల్ప్లాజా వద్ద శుక్రవారం ట్రైనీ ఐపీఎస్ మణికంఠ చండోలు అంబులెన్స్ వాహనాన్ని సీజ్చేశారు. కర్నూలు నుంచి...
![అంబులెన్స్ సీజ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పెద్దవడుగూరు, మార్చి 27 : మండలంలోని కాశేపల్లి టోల్ప్లాజా వద్ద శుక్రవారం ట్రైనీ ఐపీఎస్ మణికంఠ చండోలు అంబులెన్స్ వాహనాన్ని సీజ్చేశారు. కర్నూలు నుంచి అనంతపురం వెళుతున్న అంబులెన్స్ను తనిఖీచేశారు. అందులో నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురు ప్ర యాణికులను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.