Home » Telangana » Warangal
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన జోష్తోనే.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ దూకుడు చూపుతోంది. పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పకడ్బందీ వ్యూహాలతో ఈ ఎన్నికలో విజయం సాధించే దిశగా అటు ఎమ్మెల్యేలు.. ఇటు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
హనుమకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు.
ఒకప్పుడు జూదం అంటే ఒక ప్రాంతంలో నలుగురు చేరి డబ్బులు పెట్టి ఆడేవారు. నేటి ఆధునిక స్మార్ట్ ఫోన్ యుగంలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం పల్లెల్లోకి పాకింది. ‘ఆన్లైన్’లో బెట్టింగ్.. ఐపీఎల్ క్రికెట్, కేపీఎల్ కబడ్డీ, పేకాట, ఇతర గ్యాంబ్లింగ్ (జూదం) గేమ్లు ఏదైనా సరే యువకుల ప్రాణాలను బలిగొంటూ కుటుంబాలను నాశనం చేస్తు న్నాయి. ఒకప్పుడు విదేశాల్లో, నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ ఆన్లైన్ జూదం ఆటలు స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలతో మారుమూల పల్లెలకు చేరాయి.
లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఇటు అభ్యర్థులు.. అటు ఆయా పార్టీల నేతలు హమీలు గుప్పిస్తున్నారు. ఓరుగల్లు కాకతీయుల ఏలిన మహనగరమే అయినా.. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సౌకర్యాలు అంతంతే. రాష్ర్టానికి రెండో రాజధాని అనే మాటే తప్ప హైదరాబాద్లో ఉన్న వసతుల్లో పైసా వంతు కూడా ఇక్కడ లేనే లేవనే చర్చ ఉంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల వేళ నేతలు, అభ్యర్థులు గుప్పిస్తున్న హామీలను ఓరుగల్లు వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రజల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లు, ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
కాంగ్రెస్ దుష్ట పరిపాలనలో ఉచితబస్సు తప్ప.. ఇతర హామీలేవి అమలు కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సుయాత్ర బుధవారం సాయంత్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి రాత్రి 7.10గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.
భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి దేశం అభివృద్ధిలో అగ్రభాగానికి చేరిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మానుకోట జనసభను సోమవారం నిర్వహించారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమం చేసి సీఎం కాలేదని.. బోకరిజం చేస్తూ సీఎం అయ్యారని కామెంట్స్ చేశారు. ప్రజాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయేవాడు కాదన్నారు. కడియం శ్రీహరిని తానే పిలిచాను అని రేవంత్ అన్నారని..
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు గురువారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో ఆతర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ ఈ పట్టభద్రుల స్థానానికి నిబంధనల ప్రకారం జూన్ 8వ తేదీలోపు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
మనం రోజువారీ తాగే నీ రు పరిశుభ్రంగా లేకపోతే అనేక రోగాలు వచ్చే అవకా శం ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమల్లోకి తెచ్చింది. కానీ పైపులైన్లు, గేట్వాల్వ్ లీకేజీలు, నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయకపోవడం వం టి కారణాల వల్ల శుద్ధజలం కలుషితమవుతోంది.
అడవి అంటే పచ్చని చెట్లు.. పారేటి వాగులు.. వంకలు.. పక్షుల కిలకిలరావాలు.. వన్యప్రాణుల గెంతులాటలు ఇది పాత మాట.. ప్రస్తుతం ఎండిన నీటి వనరులు.. విద్యుదాఘాతాలు.. అగ్నిప్రమాదాలతో అటవీ ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.