Home » Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
Andhrapradesh: ఏపీలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు అల్లర్లకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఆరుగురిని సభ్యులుగా చేర్చుతూ.. వారంతో అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లి టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని అధినేత ఆదేశించారు.
Andhrapradesh: ‘‘వన్ సైడ్ విక్టరీ మాది...మళ్ళీ జగనే సీఎం’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కంటే 1 సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని.. 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.
అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం
Andhrapradesh: తిరుపతిలో టీడీపీ అభ్యర్ధి పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చెవిరెడ్డి కొడుకు చేసిన దౌర్జన్యం ప్రజాస్వామ్యానికే మచ్చ అని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేనితనంతో దాడులకు దిగడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఎస్.కోటలో ఓ వైసిపి నాయకుడు కొడుకు టీడీపీకి ఓటు వేయడానికి బెంగళూరు నుంచి వచ్చారన్నారు.
Andhrapradesh: ఓట్ల పండగ కోసం ఏపీకి ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్ ఛానల్’’ను ఏర్పాటు చేశారు.
Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్లో బయలుదేరారు.
ఓటు హక్కు ఉన్నప్పటికీ, చాలామంది వాటిని సద్వినియోగపరచుకోరు. పోలింగ్ డేను సెలవుగా ఎంజాయ్ చేస్తుంటారు. గంటల తరబడి సమాజం, ప్రభుత్వ పనితీరు, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతారు కానీ..
Andhrapradesh: దేశంలో ముస్లిం సోదరులకు ఎవరూ చేయని మంచి పనులు తాను చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం పెద్దలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Andhrapradesh: జిల్లా టీడీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముస్లిం పెద్దలు ఘనంగా సన్మినించారు.