Home » Supreme Court
కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది.. కేజ్రీవాల్కు (కోర్టు) స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నమ్ముతున్నారు’’ అని ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం.. 75 ఏళ్ల వయసు రాగానే.. అంటే 2025లో మోదీ రిటైర్ అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపైనా అమిత్ షా స్పందించారు.
న్యాయవాదులు..వినియోగదారుల పరిరక్షణ చట్టం-1986 పరిధిలోకి రారని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మహారాష్ట్రకు చెందిన భీమా- కోరెగావ్ కేసులో సామాజిక కార్యకర్త గౌతం నౌలఖాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ఆరేళ్ల పాటు నిషేధం విధించాలని..
కేజ్రీవాల్ని(CM Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తక్షణం ఇసుక అక్రమాలను నిలిపివేయించాలని, ఈ వ్యవహారంపై ఈ నెల 16లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జగన్ సర్కారును ఆదేశించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఫొటోల్లో ఉన్న అక్రమ ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలన చేయించాలని సూచించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తనపై హనుమంతుడి ఆశీర్వాదం ఉందని.. జైలు నుంచి బయటకి వచ్చాక కేజ్రీ వ్యాఖ్యానించారు.
మద్యం విధానం కేసులో యాభై రోజులుగా తిహాడ్ జైల్లో మగ్గుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ జూన్ 1న ముగియనున్న నేపథ్యంలో.. జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.
మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు.
మద్యం కేసు.. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కేజ్రీవాల్ భార్య సునీత ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు.