Home » Jagan
మళ్లీ మేమే గెలుస్తున్నామన్నారు.. మహిళలు, వృద్ధులు, యువత పెద్దఎత్తున ఓట్లేశారని.. ఇవి మాకే పడ్డాయన్నారు.. సోమవారం పోలింగ్ ముగిసీ ముగియగానే..
పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు.
గోదారోళ్ల వెటకారమే వేరు. ఏదైనా ఉతికి ఆరేస్తారు. మాటలో మర్యాద తప్పరు. గురీ తప్పదు. ఎన్నికలప్రచారం రెండునెలలకుపైగానే రంజుగా సాగి చిన్నగా గూటికి చేరుకొంటోంది. దీంతో ఎన్నికలపైనా గోదావరి జిల్లాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
మీ వాడకం ఇట్టా ఉంటుందని ఊహించలేదు నాయకా! కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను, ఐఏఎ్సలను, ఐపీఎ్సలను, సోకాల్డ్ తటస్థ మేధావులను... చివరికి తిరుమల వెంకన్న స్వామినీ వదలకుండా వాడుకోవడం మీ ఒక్కరికే సాధ్యం!.... ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దక్కిన ఘనత!
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఎప్పుడో రెండు నెలల కిందట మార్చి 1న జగన్ ‘విద్యాదీవెన’ కోసం బటన్ నొక్కారు. మే 1 కూడా వచ్చింది. అయినా, ఇంకా తల్లుల ఖాతాల్లో మాత్రం ఫీజులు పడలేదు. ‘తల్లులకు ప్రశ్నించే హక్కు’ కల్పించడానికే ఈ విధానం తెచ్చామన్నారు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అప్పు తెచ్చి సంపదను తన వద్దే కేంద్రీకృతం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే సంపద సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్రెడ్డి విజయవంతంగా గోదావరిలో ముంచేశారు. చంద్రబాబు హయాంలో ఉవ్వెత్తున సాగిన పనులను రివర్స్ టెండరింగ్తో బొంద పెట్టేశారు.
ఈ ఐదేళ్లలో అడ్డగోలుగా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు. కేంద్ర నిధులు దారి మళ్లించారు. ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు పెండింగ్ పెట్టారు. అప్పులు పెరిగాయి కానీ, ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. ‘సంక్షేమం’లోనూ సవాలక్ష నిబంధనలతో కోతలు పెట్టారు.