Share News

యశ్వంత్‌ మృతదేహం లభ్యం

ABN , Publish Date - May 09 , 2024 | 12:45 AM

సెల్ఫీ దిగుతు ండగా జారి కార్వీలో పడిమృతిచెందిన యశ్వంత్‌ మృతదేహన్ని పోలీసులు బుధవారం సాయంత్రం వెలికితీశారు.

యశ్వంత్‌ మృతదేహం లభ్యం

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 8 : సెల్ఫీ దిగుతు ండగా జారి కార్వీలో పడిమృతిచెందిన యశ్వంత్‌ మృతదేహన్ని పోలీసులు బుధవారం సాయంత్రం వెలికితీశారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన గనపవరపు యశ్వత్‌(19) పోచారం మున్సిపల్‌, నారపల్లిలో స్నేహితులతో కలిసి హస్టల్‌లో ఉంటూ కొర్రెములలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఎ్‌ససీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం యశ్వంత్‌ స్నేహితులతో కలిసి క్వారీ వద్ద సెల్ఫీ దిగుదామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి క్వారీలో పడిపోయాడు. స్నేహితులు పోలీసులకు సమాచారం అ ందించారు. పోలీసులు, డీఅర్‌ఎఫ్‌ బృందాలు మంగళవారం నుంచి గాలింపు చేపట్టారు. వర్షం కారణంగా గాలింపు చర్యలు నిలిపివేసిన పోలీసులు బుధ వారం ఉదయం తిరిగి గాలించారు. సాయంత్రం యశ్వంత్‌ మృతదేహం ల భ్యమైంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు యశ్వత్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలి ంచి, అప్పగించి కేసు నమోదు చేసుకున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:45 AM