Share News

పెళ్లింట విషాదం

ABN , Publish Date - May 09 , 2024 | 12:49 AM

కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా ఉన్న ఆ పెళ్లింట ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లయిన ఐదు రోజులకే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

పెళ్లింట విషాదం
మృతుడు సురేష్‌

వివాహమైన ఐదు రోజులకే రోడ్డు ప్రమాదంలో వరుడి మృతి

తాండూరు రూరల్‌, మే 8: కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా ఉన్న ఆ పెళ్లింట ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లయిన ఐదు రోజులకే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తాండూరు మం డలం జినుగుర్తి తండాకు చెందిన మూడవత్‌ సురేష్‌ (25) కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పర్వతాపూర్‌ గ్రామానికి చెందిన అనితతో ఈ నెల 3న జినుగుర్తితండాలో వివాహమైంది. మంగళవారం జినుగుర్తితండాలో సురే్‌షను అదే తండాకు చెందిన కడావత్‌ సురేష్‌ బైక్‌పై ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. సాయ ుంత్రం 6గంటల ప్రాంతంలో బైక్‌పై ఇద్దరు వస్తూ తండాసమీపంలోని మూలమలుపు వద్ద అదుపుతప్పి కింద పడ్డారు. బైక్‌ వెనక కూర్చున్న సురేష్‌ తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సురేష్‌ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. అతడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:49 AM