Share News

ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , Publish Date - May 09 , 2024 | 12:43 AM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఏ లక్ష్మారెడ్డి అన్నారు. బుఽధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చౌదరిగూడ మండల కేంద్రంలో ఉపాధి కూలీలకు ఓటుహక్కు వినియోగంపై స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలి
చౌదరిగూడలో ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తున్న టీఏ లక్ష్మారెడ్డి

చౌదరిగూడ, మే 8: లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఏ లక్ష్మారెడ్డి అన్నారు. బుఽధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చౌదరిగూడ మండల కేంద్రంలో ఉపాధి కూలీలకు ఓటుహక్కు వినియోగంపై స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుహక్కు వజ్రాయుధం లాంటిందని, ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలన్నారు. మీతో పాటు చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. నిప్పక్షపాతంగా ఓటు వేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:43 AM