వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:58 PM
చిన్నపాటి గొడవ కారణంగా ఓ వ్యక్తిని మినీ గ్యాస్ సిలిండర్తో నెత్తిపై బాది దారుణంగా హతమార్చారు.
మేడ్చల్ టౌన్, ఏప్రిల్ 28: చిన్నపాటి గొడవ కారణంగా ఓ వ్యక్తిని మినీ గ్యాస్ సిలిండర్తో నెత్తిపై బాది దారుణంగా హతమార్చారు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీ్సగడ్ రాష్ట్రానికి చెందిన లక్కు(40) జీవనోపాధి నిమిత్తం మేడ్చల్ మండలంలోని మురాహరిపల్లిలో జీవనం సాగిస్తున్నాడు. అతడికి రాజు అనే వ్యక్తితో మూడు రోజుల రిందట గొడవ జరిగింది. దీంతో అదివారం సాయంత్రం లక్కు గ్రామంలోని లక్ష్మీదుర్గా షాపులో షట్టర్ వద్ద నిద్రిస్తుండగా రాజు మినీ గ్యాస్ సిలిండర్తో లక్కు తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో లక్కు రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితుడు జినామీ వాలి పోలీస్టేషన్లో లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.