విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ABN , Publish Date - May 09 , 2024 | 12:44 AM
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతిచెందిన ఘటన శామీర్పేట్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది.
మూడుచింతలపల్లి, మే 8 : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతిచెందిన ఘటన శామీర్పేట్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూంకుంటకు చెందిన లక్ష్మన్రావు(26), మునిసి పాలి టీలోని ఓ పౌల్ర్టీఫామ్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ నుంచి మోటర్ల సాయంతో దాణా దించుతుండగా కరెంటు వైర్లు తగిలి కరెంట్ షాక్తో లక్ష్మన్రావు పడిపోయాడు. కుటుంబ సభ్యులు 108లో ఆస్పత్రికి లక్ష్మణ్ తర లించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జి సాదిక్, పౌల్ర్టీ యజమాని రాజేందర్వావుపై చర్యలు తీసుకోవాలని పో లీసు లకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.