అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:02 AM
మండలంలోని కాచవానిసంగారం అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 28: మండలంలోని కాచవానిసంగారం అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీడీవో స్వాతి పాల్గొని మాట్లాడారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని టీచర్లను ఆదేశించారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపరింటెండెంట్ సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్లు రజిని, సరస్వతి, ఉమారాణి, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.