భవనం స్లాబ్ కూలి కార్మికుడి దుర్మరణం
ABN , Publish Date - May 09 , 2024 | 12:47 AM
అక్రమంగా నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ స్లాబ్ కూలి కార్మికుడు దుర్మరణం చెందాడు. తాండూరు పట్టణం లారీ పార్కింగ్ సమీపంలోని హసన్నగర్ ప్రాంతంలో ఓ వ్యా పారి నాలుగు అంతస్థుల బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు.
స్లాబ్ శిథిలాల కింద మృతిచెందిన మేస్ర్తి
తాండూరు, మే 8 : అక్రమంగా నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ స్లాబ్ కూలి కార్మికుడు దుర్మరణం చెందాడు. తాండూరు పట్టణం లారీ పార్కింగ్ సమీపంలోని హసన్నగర్ ప్రాంతంలో ఓ వ్యా పారి నాలుగు అంతస్థుల బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. బుధవారం పనులు చేసేందుకు బొంరా్సపేట్ మండలం జానకంపల్లికి చెందిన మోతుకూర్ వెంకటయ్య(42), సత్తమ్మ అనే మహిళతో కలిసి వచ్చారు. భవనం కింద వెంకటయ్య ఉన్న సమయంలో 4వ అంతస్థులో స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. పక్కనే ఉన్న జీపుతో పాటు సరి గ్గా వెంకటయ్య మీద స్లాబ్ పడడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సీఐ సంతో్షకుమార్, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్స్కవేటర్తో స్లాబ్ శిథిలాల కింద ఉన్న వెంకటయ్య మృతదేహాన్ని వెలికి తీశారు. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేన్నట్లుగా తెలిసింది. భవనం నాణ్యత లేకుండా చేపట్టడం వల్లే కూప్పకూలిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.