Share News

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:20 AM

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 28 : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సుల్తాన్‌పల్లికి చెందిన మైలారం శ్రీనాఽథ్‌(38) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. చౌదరిగూడలోని సిద్ధాంతి బస్తీకి చెందిన మంచర్ల శ్రీనివాస్‌ ఫౌంహౌ్‌సలో కరెంట్‌ సమస్య ఉందని పనికి వెళ్లాడు. పనులు చేస్తుండగా షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి పనివారు ఫౌంహౌస్‌ యజమాని శ్రీనివా్‌సకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన శ్రీనాథ్‌ మృతిచెందడంతో ఆ కుటుంబ రోడ్డునపడింది. భార్య, పిల్లలు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..

షాద్‌నగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 28: షాద్‌నగర్‌ పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్‌ పంప్‌ ఎదురుగా ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తిమృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ ప్రతా్‌పలింగం తెలిపారు. షాద్‌నగర్‌కు చెందిన బస్సు(ఏపీ 21జడ్‌ 0086) చౌదరిగూడ మండలం పీర్జాపూర్‌ గ్రామానికి వెళ్లి తిరిగి షాద్‌నగర్‌ డిపోకు వస్తుండగా జడ్చర్ల రోడ్డులో ఉన్న ఆర్టీసీ పెట్రోల్‌ బంక్‌ వద్ద యూటర్న్‌ తీసుకుంటోంది. ఈక్రమంలో బస్సు టైర్‌కింద పడి గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు ముందు టైరు తల మీదుగా వెళ్లడంతో మెదడు చిట్లిపోయింది. మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లాక్‌ కలర్‌ ప్యాంటు, వైట్‌ కలర్‌(చెక్స్‌) షర్టు ఉందని చెప్పారు.

Updated Date - Apr 29 , 2024 | 12:20 AM