డీకే అరుణ జన్మదిన వేడుక.. ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - May 05 , 2024 | 12:17 AM
మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ జన్మదిన సందర్భంగా శని వారం ఆ పార్టీ నాయకులు కొత్తూర్లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
కొత్తూర్, మే 4 : మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ జన్మదిన సందర్భంగా శని వారం ఆ పార్టీ నాయకులు కొత్తూర్లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఓ వైపు జన్మదిన వేడుకలతో పాటు, ఎ న్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్లుకున్నారు. వేడుకలకు హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఎన్.శ్రీవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ఎర్రవెళ్లి నాగరాజుచారి, పార్లమెంట్ కోకన్వీనర్ నర్సింహాగౌడ్, నాయకులు కడెంపల్లి సదానంద్గౌడ్, బావండ్ల మాణిక్యం, మంగళి రమేష్ పాల్గొన్నారు.
బీజేపీలో చేరిన బీఎస్పీ నాయకుడు
షాద్నగర్ అర్బన్: షాద్నగర్ అసెంబ్లీ స్థానంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన పసుల ప్రశాంత్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే.అరుణ సమక్షంలో ఆయన బీజేపీ లో చేరారు. అలాగే బీఆర్ఎ్సకు చెందిన క్యామ మహేష్, క్యామ శ్రీనివాస్, అభిరామ్, యాదగిరి, పలువురు యువకులు బీజేపీలో చేరారు. మరోసారి నరేంద్రమోదీ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారని అరుణ అన్నారు. నాయకులు బాబయ్య, వెంకటే్షగుప్తా పాల్గొన్నారు.