Share News

గౌడలకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం : ఎమ్మెల్యే శంకర్‌

ABN , Publish Date - May 05 , 2024 | 12:15 AM

గౌడ కులస్థులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

గౌడలకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం : ఎమ్మెల్యే శంకర్‌
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

షాద్‌నగర్‌ అర్బన్‌/షాద్‌నగర్‌ రూరల్‌/కొత్తూర్‌/ కేశంపేట, మే 4 : గౌడ కులస్థులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. షాద్‌నగర్‌లోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్‌లో శనివారం గౌడల సమ్మేళనానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో గౌడలంతా కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి ఓటు వేయాలని కోరారు. మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, శివశంకర్‌గౌడ్‌, జి.బాల్‌రాజ్‌గౌడ్‌, గోవర్ధన్‌గౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, వెంకటే్‌షగౌడ్‌, కుమారస్వామిగౌడ్‌, రాఘవేందర్‌గౌడ్‌, రాములుగౌడ్‌ పాల్గొన్నారు. షాద్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద మాజీ సర్పంచ్‌ లలిత అంజ య్య, కార్యకర్తలు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డిల సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఎంపీపీ ఇద్రి్‌సఅహ్మద్‌, శ్రీశైలం, లింగం, రాకేష్‌, పాండు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సుస్థిరపాలన అందుతుందని కేశంపేట జడ్పీటీసీ, మండల కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌చార్జి విశాలశ్రవణ్‌ అన్నారు. కొత్తూర్‌లో చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచులు జె.సుదర్శన్‌గౌడ్‌, జగన్‌, నాయకులు జనార్ధన్‌చారి, నర్సింహ పాల్గొన్నారు. కేశంపేట, మండలంలోని అల్వాల, పాటిగడ్డ, కొత్తపేట, ఎర్రగడ్డ తండాల్లో ఎమ్మెల్యే శంకర్‌, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి ప్రచారం నిర్వహించారు. రైతులకు త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే వంశీచంద్‌ను గెలిపించాలని వివరించారు. ఆయా గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కాంగ్రె్‌సలో చేరగా నేతలు కండవా కప్పి ఆహ్వానించారు. పార్టీ మండలాధ్యక్షుడు వీరేశ్‌, జగదీశ్వర్ప, సురే్‌షరెడ్డి, టి.శ్రవణ్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఇబ్రహీం, ఎ.రమేష్‌, భాస్కర్‌గౌడ్‌, గిరిధర్‌, పెంటయ్య, రూప్లా, యాదగిరి పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:15 AM