రూ.6 లక్షల విలువైన సిగరెట్లు అపహరణ
ABN , Publish Date - May 09 , 2024 | 12:51 AM
పట్టణంలోని జాతీయ రహదారిపై గల క్రాంతి కుమార్ ఏజెన్సీ స్టోర్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ.6లక్షల విలువ చేసే వివిధ కంపెనీల సిగరెట్లను అపహరించుకుపోయారు.
ఆమనగల్లు, మే 8 : పట్టణంలోని జాతీయ రహదారిపై గల క్రాంతి కుమార్ ఏజెన్సీ స్టోర్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ.6లక్షల విలువ చేసే వివిధ కంపెనీల సిగరెట్లను అపహరించుకుపోయారు. దుకాణ నిర్వాహకుడు సామల క్రాంతి కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఆమనగల్లు పట్టణంలోని ఏపీజీవీబీ సమీపంలో గల స్టోర్లో పెద్దఎత్తున హోల్సేల్ విక్రయాలు సాగిస్తారు. సిగరెట్లు, ఇతర వస్తువులు నిల్వ ఉంటాయి. దుకాణం ఎదుట సీసీ కెమెరాలు కూడా లేవు. ఇదే అదనుగా భావించిన దొంగలు బుధవారం తెల్లవారుజామున దుకాణం షెట్టర్ను ధ్వంసం చేసి దుకాణం లోపలికి ప్రవేశించారు. అందులో నిల్వ ఉన్న వివిధ రకాల కంపెనీలకు చెందిన సిగరెట్లు మాత్రమే చోరీ చేశారు. యజమాని ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీఎస్ పోలీసులు, క్లూస్టీం, ఫోరెన్సిక్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.