బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:19 AM
ఆరోగ్యం బాగోలేదని వ్యవసాయ బావిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
కడుపునొప్పి భరించలేక అఘాయిత్యం!
చేవెళ్ల, ఏప్రిల్ 28 : ఆరోగ్యం బాగోలేదని వ్యవసాయ బావిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఊరెళ్లకు చెందిన మంగలి పార్వతమ్మ(65)కు కొన్ని రోజుల క్రితం గర్భసంచి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఆమె తరచూ కడుపునొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలో ఆరోగ్యం బాగుపడటం లేదని మనస్తాపం చెందిన పార్వతమ్మ శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గ్రామ శివారులోని ఊరడి ధర్మయ్య వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రోజూ మాదిరిగానే గ్రామంలో తెలిసినవారి ఇంటికి వెళ్లి ఉంటుందని కుటుంబసభ్యులు భావించారు. కానీ, రాత్రి 8 గంటలు దాటినా ఇంటికి రాకవపోడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతికినా ఎక్కడ ఆచూకీ దొరకలేదు. రాత్రి సమయంలో గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావిలో చూడగా పార్వతమ్మ మృతదేహం నీటిపై తేలి ఉండటాన్ని గమనించారు. దాంతో పోలీ్సలకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గ్రామస్తులతో సాయంతో బయటకు తీయించారు. అదేరాత్రి పోస్టుమాఠ్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆదివారం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.