మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత ప్రతీ ఒక్కరిది
ABN , Publish Date - May 09 , 2024 | 12:44 AM
కేంద్రంలోని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత ప్రతీ ఒక్కరిది అని సీపీఎం జాతీయ నాయకుడు సాయిబాబా అన్నారు
సీపీఎం జాతీయ నాయకుడు సాయిబాబా
భూదానపోచంపల్లి, మే 8 : కేంద్రంలోని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత ప్రతీ ఒక్కరిది అని సీపీఎం జాతీయ నాయకుడు సాయిబాబా అన్నారు. భువనగిరి పార్లమెంట్ సీపీఎం అభ్యర్ధి ఎండీ జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ బుధవారంభూదానపోచంపల్లి పట్టణంలో సీపీఎం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం మండల కమిటీ సభ్యులు ప్రసాదం విష్ణు ఆద్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన సీపీఎం జాతీయ నాయకులు సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమని, ఎర్రజెండా నాయకత్వంలో దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిన గడ్డ అని అన్నారు. వామపక్షాలు పార్లమెంటులో యూపీఏకు మద్ధతు ఇవ్వడం ద్వారా మహాత్మా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకున్నామని, అలాంటి చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయడానికి అనేక కుట్రలు పన్నిందన్నారు. కార్యక్రమాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహ, వెంకటేష్, కూరపాటి రమేష్, సీపీఎం మండల కార్యదర్శి పగిల్ల లింగారెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల నాయకులు కోట రామచంద్రారెడ్డి, ప్రసాదం విష్ణు, మధు పాల్గొన్నారు.