వేమూరి కనకదుర్గకు ఘన నివాళులు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:04 AM
‘ఏబీఎన్, ఆంధ్రజ్యోతి’ సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ తృతీయ వర్ధంతి సందర్భంగా నల్లగొండ ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్ కార్యాలయం లో ఆమెకు శనివారం ఘన నివాళులు అర్పించారు.
నల్లగొండ, ఏప్రిల్ 27: ‘ఏబీఎన్, ఆంధ్రజ్యోతి’ సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ తృతీయ వర్ధంతి సందర్భంగా నల్లగొండ ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్ కార్యాలయం లో ఆమెకు శనివారం ఘన నివాళులు అర్పించారు. వేమూరి కనకదుర్గ చిత్రపటానికి ‘ఆంధ్రజ్యోతి’ నల్లగొండ బ్రాంచ్ మేనేజర్ దాసరి చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఏబీఎన్, ఆంధ్రజ్యోతి’ అభివృద్ధికి వేమూరి కనకదుర్గ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ బ్యూరో ఇన్చార్జి చల్లా సాంబశివారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ఆందోజు కృష్ణమాచారి, నల్లగొండ పీసీ ఇన్చార్జి పులిమామిడి మహేందర్రెడ్డి, పాల్గొన్నారు.