అదానీ, అంబానీలకు బీజేపీ చేయూత
ABN , Publish Date - May 08 , 2024 | 11:21 PM
జహీరాబాద్, మే 8: కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు దోచిపెట్టి చేయూతనిచ్చిందని జోడోయాత్ర సభ్యుడు, ప్రొఫెసర్ సుకుమార్ పేర్కొన్నారు.
బీజేపీకి ఓటేస్తే సంక్షోభంలో పడనున్న రాజ్యాంగం
జోడోయాత్ర సభ్యుడు, ప్రొఫెసర్ సుకుమార్
జహీరాబాద్, మే 8: కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు దోచిపెట్టి చేయూతనిచ్చిందని జోడోయాత్ర సభ్యుడు, ప్రొఫెసర్ సుకుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సిద్ది-ఇన్లో పలువురు మేధావివర్గాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడే మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గడిచిన పదేళ్ల కాలంగా నరేంద్రమోదీ దేశానికి పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదన్నారు. 400 సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మారుస్తామని, మైనార్టీల రిజర్వేషన్లు తొలగిస్తామని, ఇలా రాజ్యాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అందరం ఓటు అనే ఆయుధంతో తిప్పికొట్టాలని చెప్పారు. సమాజంలో అందరిని సంఘటితం చేస్తు చైతన్యపరిచేందుకుగాను తాము కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన వివరించారు. రాజ్యాంగం సంక్షోభంలో పడకముందే అందరం ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి సురే్షకుమార్ షెట్కార్కు ఓటేసి గెలిపించాలన్నారు. అనంతరం న్యాయవాది రమణారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్ధన్, రాజుషెట్కార్, తుక్కారెడ్డి, మేధావులు పాల్గొన్నారు.