Share News

రైలు ఢీకొని యువకుడి మృతి

ABN , Publish Date - May 08 , 2024 | 11:22 PM

రామాయంపేట, మే 8: చెవిలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని బైక్‌ను పట్టాలు దాటిస్తుండగా రైలు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృచెందాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట సమీపంలో జరిగింది.

రైలు ఢీకొని యువకుడి మృతి

ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని బైక్‌పై ట్రాక్‌ దాటుతుండగా ఘటన

భయంతో పారిపోయిన మరో యువకుడు

రామాయంపేట, మే 8: చెవిలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని బైక్‌ను పట్టాలు దాటిస్తుండగా రైలు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృచెందాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట సమీపంలో జరిగింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన ప్రకాశ్‌(25), మరో స్నేహితుడితో కలిసి రామాయంపేటకు వచ్చాడు. ప్రకాశ్‌ చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా బైక్‌ను పట్టాలు దాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ వెనక సీటులో కూర్చున్న యువకుడు భయంతో పారిపోయాడు. కామారెడ్డి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 08 , 2024 | 11:22 PM