ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా
ABN , Publish Date - May 08 , 2024 | 11:24 PM
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డిలతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి అన్నారు.
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి
తిమ్మాజిపేట/కొల్లాపూర్, మే 8 : ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డిలతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపించండి అని ప్రజలను ఆయన కోరారు. తిమ్మాజిపేట మండల పరిధిలోని ఆవంచలో బుధవారం ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు, కులమతాలకతీతంగా ప్రతీ పేదోడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. సా మాజిక న్యాయమే లక్ష్యం అంటూ గొప్పలు చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అసత్య ప్రచారాలు చేస్తూ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎంత వరకు సమంజస మన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ప్రభు త్వానికి మద్దతు తెలపాలన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన వి ధంగా ఆగస్టు 15వరకు ఏకకాలంలో రైతుకు రెండు ల క్షల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో తిరుగుతామని నిరుపేదలను గు ర్తించి ఇంది రమ్మ ఇళ్లు వంటి మరెన్నో గ్యారెంటీ పథ కాలను లబ్ధి దారులకు అందజేయడం జరుగుతుంద న్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక డాక్టర్ మల్లురవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డి ప్రజలను కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయ కులు శ్రీనివాస్బహుదూర్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉస్మాన్, లక్ష్మీనారాయణ, శ్రీశైలం, పరమేశ్వర్, వెంకట్రా ములు, నాగసాయిలు, వివేక్రెడ్డి, భాస్కర్రెడ్డి, రవీందర్రెడ్డి, ఎల్లారెడ్డి, సహదేవ్, వరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యా యం చేకూరుతుందని కాంగ్రెస్ నాగర్కర్నూల్ పార్ల మెంట్ అభ్యర్థి మల్లురవి పేర్కొన్నారు. బుధవారం రా త్రి కొల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మైనార్టీ నాయకు లతో సమావేశమయ్యారు. దేశంలో నరేంద్రమోదీ ప్ర భుత్వం మైనార్టీలకు చేసిందేమి లేదని, రాష్ట్రంలో కేసీ ఆర్ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని వాటిని అమలు పర్చలేదని వారు పేర్కొన్నారు. ఆది నుంచి మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తూ వచ్చిందని, ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపించాలని మల్లు రవి కోరారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రె స్ కార్యకర్తలతో సమావేశమై ఎంపీ ఎన్నికల్లో చేపట్టా ల్సిన పని విధానాన్ని దిశా నిర్దేశం చేశారు.