Share News

ఎన్నికల తరువాత రుణమాఫీ : ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:28 PM

కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.

ఎన్నికల తరువాత రుణమాఫీ : ఎమ్మెల్యే
పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

మదనాపురం, ఏప్రిల్‌ 28: కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని కార్యకర్తలు కలిసికట్టుగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి వచ్చిన నాలుగు నెలలో చేసిన అభివృద్ధ్ది పనుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల తరువాత రైతురుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, శరత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ, కృష్ణవర్ధన్‌రెడ్డి, జగదీష్‌, మహేష్‌కుమార్‌, శేఖర్‌రెడ్డి, వేమన్న, కోటేష్‌, రవీందర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:28 PM