Share News

విద్య, వైద్యంతోనే అభివృద్ధి

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:34 PM

కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ప్రజల్లో మంచి ఆధరణ వస్తోందని, ఇది చూసి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు మింగుడు పడ టం లేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

 విద్య, వైద్యంతోనే అభివృద్ధి
ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సన్మానిస్తున్న నాయకులు

చిన్నంబావి ఏప్రిల్‌ 28 : కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ప్రజల్లో మంచి ఆధరణ వస్తోందని, ఇది చూసి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు మింగుడు పడ టం లేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. లోక్‌ సభ ఎన్నిక ల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మండలంలోని వెల్టూరు, అయ్యవారి పల్లి, చెల్లెపాడు, కొప్పునూరు, పెద్దమారుర్‌ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ రాజకీయంగా ప్రతీరోజు వార్తల్లో నిలవాలని దురుద్దేశంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రుణపడి ఉన్నామని, ఆ తల్లి రుణం తీర్చుకోవడా నికి ఎల్లప్పుడు మనం ముందుండాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నా రు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల ఆఽధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ బగ్గారి నరసింహరెడ్డి, వైస్‌ చైర్మన్‌ విద్యాసాగర్‌ రావు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:34 PM