ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ
ABN , Publish Date - May 05 , 2024 | 12:43 AM
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిం గ్ రాజ్ఠాకూర్ చెప్పారు.
కళ్యాణ్నగర్, మే 4: ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిం గ్ రాజ్ఠాకూర్ చెప్పారు. శనివారం రాత్రి 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో వం ద మంది చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజల కు ఆరు గ్యారంటీపథకాలు హామీ ఇచ్చిం దని, వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీ ప థకాలను ప్రవేశపెట్టిందని, ఎన్నికల త రువాత మరో గ్యారంటీ పథకాన్ని అమ లు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్య క్రమంలో కార్పొరేటర్ మహంకాళి స్వా మి, పొన్నం లక్ష్మణ్, బెంద్రం నాగభూ షణ్, హమీద్, సిర్ర సంపత్రెడ్డి, డప్పు రాంమూర్తి, చిదురాల అశోక్, పెరుమాం డ్లు, సత్యం, రాజేందర్ పాల్గొన్నారు.