కాంగ్రెస్లో చేరిన బుగ్గారం జడ్పీటీసీ, ఎంపీపీ
ABN , Publish Date - May 09 , 2024 | 12:46 AM
బుగ్గారం మండల జడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంపీపీ బాదినేని రాజమణి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్రెడ్డి
బుగ్గారం, మే 8: బుగ్గారం మండల జడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంపీపీ బాదినేని రాజమణి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. బుధవారం ఆర్ముర్లో జరిగిన సభలో సీఎం రేవంత్రెడ్డి బాదినేని దంపతులు కాంగ్రెస్ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచామని, 15 సంవత్సరాల నుంచి ఎంపీపీగా, జడ్పీటీసీగా ప్రజలకు నీరంతరం సేవలు చేశామన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తమను గుర్తించలేదని అందుకే బీఆర్ఎస్కు రాజీనామా చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరామని తెలిపారు.