Share News

ఘనంగా బోనాలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:18 AM

మండలంలోని పోతిరెడ్డిపల్లిలో రేణుక ఎల్లమ్మతల్లి బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా బోనాలు

వీణవంక, ఏప్రిల్‌ 28: మండలంలోని పోతిరెడ్డిపల్లిలో రేణుక ఎల్లమ్మతల్లి బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గౌడ కులస్థులు రేణుక ఎల్లమ్మ తల్లి అలయాన్ని నిర్మించారు. ఆదివారం గ్రామంలోని గౌడ కులస్థులు బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా డప్పు చప్పుల్ల మద్య వెళ్లి మొక్కులు చెలించారు. పూనకం వచ్చిన మహిళలు నృత్యాలు చేస్తు భవిష్యవాణి వినిపించారు.

గన్నేరువరం: మండలంలోని ఖాసింపేట గ్రామంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా ఇంటికో బోనమెత్తుకొని డప్పు చప్పుళ్ళతో, శివసత్తుల పూనకాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గంప మల్లీశ్వరి వెంకన్న, ఎంపీటిసి ఏలేటి స్వప్న చంద్రారెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ బద్దం సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:18 AM