Kumaram Bheem Asifabad: మొరాయించిన వేంపల్లి రైల్వే గేటు
ABN , Publish Date - Apr 26 , 2024 | 10:11 PM
సిర్పూర్(టి), ఏప్రిల్ 26: సిర్పూర్(టి)-కాగజ్నగర్ ప్రధాన రహదారిపై వేంపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేటు శుక్రవారం మొరాయించింది. దీంతో రెండు గంటల పాటు వాహనదారులు, ప్రజలు ఎర్రటిఎండలో నిరీక్షించాల్సి వచ్చింది.
- ఎర్రటి ఎండలో రెండు గంటల నిరీక్షించిన ప్రయాణికులు
సిర్పూర్(టి), ఏప్రిల్ 26: సిర్పూర్(టి)-కాగజ్నగర్ ప్రధాన రహదారిపై వేంపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేటు శుక్రవారం మొరాయించింది. దీంతో రెండు గంటల పాటు వాహనదారులు, ప్రజలు ఎర్రటిఎండలో నిరీక్షించాల్సి వచ్చింది. నీడకోసం షెడ్డు లాంటివి లేకపోవడంతో చెట్ల కిందికి పరుగులు తీశారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్దరించారు. అయితే రైల్వేగేటు వద్ద నిర్మిస్తున్న ఓఆర్బీ పనులు పూర్తైతే కానీ తమకష్టాలు తీరేలా లేవని ప్రయాణికులు పేర్కొంటున్నారు.