Kumaram Bheem Asifabad: ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
ABN , Publish Date - Apr 28 , 2024 | 10:06 PM
కాగజ్నగర్, ఏప్రిల్ 28: పార్లమెంటు ఎన్నికల్లో బీజేప్టీని ఓడించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. ఆదివారం రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించినట్టు తెలిపారు.
-సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు
కాగజ్నగర్, ఏప్రిల్ 28: పార్లమెంటు ఎన్నికల్లో బీజేప్టీని ఓడించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. ఆదివారం రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించినట్టు తెలిపారు. కనీసవేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండు చేసినప్పటికీ ఇంత వరకు ఆచరణలోకి తీసుకురాలేదన్నారు. 29కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్కోడ్లను తెచ్చినట్టు పేర్కొన్నారు. ఈకోడ్తో కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు కొల్పోయినట్టు వివరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ డిమానిటైజేషన్ ద్వారా 15కోట్ల మంది రోజువారి కూలీలు ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలిపారు. సమావేశంలో సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ త్రివేణి, శ్రీకాంత్, సహాయ కార్యదర్శి పద్మ, జిల్లా నాయకులు శంకర్, సంజీవ్, కృష్ణమాచారి, విలాస్, అంకయ్య, విఠల్, చంద్రకళ, రాజేశ్వరి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.