శభాష్ సాయిచరణ్: సీఎం రేవంత్ రెడ్డి..

ABN, Publish Date - Apr 29 , 2024 | 10:48 AM

హైదరాబాద్ శివారులోని అల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం (26వ తేదీ) అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి 16 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు. బాలుడి సాహసాన్ని సీఎం రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కొనియాడారు.

శభాష్ సాయిచరణ్: సీఎం రేవంత్ రెడ్డి.. 1/5

షాద్ నగర్‌లోని అల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులను బాలుడు సాయిచరణ్ కాపాడటం తెలిసిందే. అంత మంది ప్రాణాలు కాపాడిన సాహస బాలుడిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

శభాష్ సాయిచరణ్: సీఎం రేవంత్ రెడ్డి.. 2/5

సాహస బాలుడు ఎం.సాయిచరణ్‌ను సీఎం రేవంత్ రెడ్డి శాలువ కప్పి, పుష్పగుచ్చములిచ్చి అభినందిస్తున్న దృశ్యం.

శభాష్ సాయిచరణ్: సీఎం రేవంత్ రెడ్డి.. 3/5

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో సాయిశరణ్ తల్లిదండ్రులు రేణుక, వెంకటేష్, స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

శభాష్ సాయిచరణ్: సీఎం రేవంత్ రెడ్డి.. 4/5

ఈ నెల 26వ తేదీన షాద్‌నగర్ నందిగామ శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం దృశ్యం.

శభాష్ సాయిచరణ్: సీఎం రేవంత్ రెడ్డి.. 5/5

సాహస బాలుడు ఎం.సాయిచరణ్‌ను అభినందిస్తున్న పోలీస్ అధికారి.. కాగా ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన సాయి..

Updated at - Apr 29 , 2024 | 10:48 AM