Home » Ranga Reddy
యాభై మంది పనిచేస్తున్న పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి మంటల్లో చిక్కుకుంటే.. అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ఐదుగురి ప్రాణాలు కాపాడాడో 16 ఏళ్ల బాలుడు! రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో జరిగిందీ ఘటన.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హరిని అనే బాలిక ఇంటర్ మొదటి సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెంది గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో విద్యార్థిని నిర్ణయం తీసుకుంది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ శివరాంపల్లిలో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఇన్నోవా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ముందు భాగం నుంచి మంటలను గమనించిన డ్రైవర్ కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు.
Telangana: ఆ వ్యాపారి కుటుంబీకులు అంతా ఎంతో ఉత్సాహంగా దైవదర్శనానికి వెళ్లారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగుపయనమయ్యారు. అయితే ఇంటికి వచ్చిన చూసిన ఆ కుటుంబీకులకు మాత్రం పెద్ద షాకే తగిలింది. అయ్యో ఎంత పని జరిగిదంటూ యజమానులు లబోదిబోమని మొత్తుకున్నారు. ఇంతకీ వాళ్లు తిరిగివచ్చేసే సరికి ఏం జరిగిందనే దానిపై వివరాలలోకి వెళ్తే...
Telangana: రాజేంద్రనగర్లో పట్టపగలే దొంగలు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి తెగబడ్డారనే వార్త తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్ను పోలీసులు బయటపెట్టారు. అసలు దొంగతనమే జరగలేదనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇదంతా ఆ ఇంట్లోని యువతి ఆడిన డ్రామాగా నిర్ధారించారు. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో యువతి ఇంతటి డ్రామాకు తెరతీసినట్లు ఖాకీల విచారణలో బయటపడింది. యువతి చేసిన పనికి షాక్ అవడం కుటుంబ సభ్యుల వంతైంది.
Telangana: జిల్లాలో దొంగల ఆగడాలకు అంతేలేకుండా పోతంది. వేసవి కాలం నేపథ్యంలో ఉక్కపోతగా ఉండటంతో ప్రజలు ఆరు బయట నిద్రించేందుకు ఇష్టపడుతుంటారు. ఇదే అదునుగా భావించి దొంగలు తమ చేతులకు పనులు చెబుతుంటారు. అర్ధరాత్రులు దర్జాగా ఇంట్లోకి చొరబడి దొరికకాడికి దోచుకుంటుంటారు. అయితే రాజేంద్రనగర్లో మాత్రం దొంగలు చేసిన పని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. పట్ట పగలు అని చూడకుండా.. ఎలాంటి అదురు బెదరు లేకుండా దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు.
రంగారెడ్డి జిల్లా: కాటేదాన్లో దారుణం జరిగింది. గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని దుండగుడు మహిళ తలపై బండరాయితో మోదీ హతమార్చాడు.
Telangana: నాలుగేళ్ల బాబు కిడ్నాప్ను రెండు గంటల్లోనే చేధించిన శభాష్ అనిపించుకున్నారు సూరారం పోలీసులు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న (గురువారం) నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న మల్లారెడ్డి ఆసుపత్రిలో ఇషాన్ రెడ్డి (4) అనే బాబు కిడ్నాప్కు గురయ్యాడు. రాజశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు తమ కుమారుడు ఇషాన్ రెడ్డితో కలిసి నిన్న (గురువారం) మల్లారెడ్డి హాస్పటల్కు మెడికల్ చెకప్ కోసం వచ్చారు.
హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... మంగళవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందకు పడిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు.. అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది.
వికారాబాద్: రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. రెండు గంటల పాటు ఓ వ్యక్తి నరకయాతన పడ్డాడు. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు. అదుపు తప్పి ట్రైన్... ప్లాట్ ఫారం మధ్యలో పడిపోయాడు.