Congress: మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ జనజాతర సభ

ABN, Publish Date - May 10 , 2024 | 01:09 PM

మెదక్: ఇందిరాగాంధీ గతంలో గెలిచిన మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆమె మనవడు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహించిన జనజాతరకు అపూర్వ స్పందన వచ్చింది. నర్సాపూర్‌ వేదికగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇందిరాగాంధీ విజయాన్ని పునరావృతం చేసే దిశగా ఆయన జన జాతర సభలో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీలో సైనికుడిలా పనిచేస్తానన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఏది అవసరమో ఢిల్లీ నుంచి అమలయ్యేలా చూస్తానని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆయన వేదిక నుంచి 14 నిమిషాల పాటు ప్రసంగించారు. మాట్లాడినంత సేపు సభా ప్రాంగణం హోరెత్తింది. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసగించారు.

Congress: మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ జనజాతర సభ 1/6

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు విచ్చేసిన రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.. ప్రక్కన సీఎం రేవంత్ రెడ్డి.

Congress: మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ జనజాతర సభ 2/6

నర్సాపూర్‌లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..

Congress: మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ జనజాతర సభ 3/6

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

Congress: మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ జనజాతర సభ 4/6

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ జనజాతర ప్రసంగిస్తున్న దృశ్యం.

Congress: మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ జనజాతర సభ 5/6

మెదక్ జిల్లా, నర్సాపూర్‌లో గురువారం జరిగిన జనజాతర సభకు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇందిరా గాంధీ మెమెంటోను అందజేస్తున్న స్థానిక నేతలు..

Congress: మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ జనజాతర సభ 6/6

మెదక్ జిల్లా, నర్సాపూర్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్ జనజాతర సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు..

Updated at - May 10 , 2024 | 01:09 PM