Congress: మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ జనజాతర సభ
ABN, Publish Date - May 10 , 2024 | 01:09 PM
మెదక్: ఇందిరాగాంధీ గతంలో గెలిచిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె మనవడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నిర్వహించిన జనజాతరకు అపూర్వ స్పందన వచ్చింది. నర్సాపూర్ వేదికగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇందిరాగాంధీ విజయాన్ని పునరావృతం చేసే దిశగా ఆయన జన జాతర సభలో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీలో సైనికుడిలా పనిచేస్తానన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఏది అవసరమో ఢిల్లీ నుంచి అమలయ్యేలా చూస్తానని రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. ఆయన వేదిక నుంచి 14 నిమిషాల పాటు ప్రసంగించారు. మాట్లాడినంత సేపు సభా ప్రాంగణం హోరెత్తింది. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి ప్రసగించారు.
Updated at - May 10 , 2024 | 01:09 PM