Share News

Jammu Kashmir: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు..ఐదుగురు జవాన్లకు గాయాలు

ABN , Publish Date - May 04 , 2024 | 08:59 PM

జమ్మూకశ్మీర్‌‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదులు శనివారం సాయంత్రం కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.

Jammu Kashmir: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు..ఐదుగురు జవాన్లకు గాయాలు

పూంచ్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై ఉగ్రవాదులు శనివారం సాయంత్రం కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఉదంపూర్‌లోని కమాండ్ హాస్పిటల్‌కు తరలించారు. సురాన్‌కోతె ఏరియాలోని సనాయ్ టాప్ ప్రాంతానికి కాన్వాయ్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను రప్పించి పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 09:02 PM