Home » National News
Model Code of Conduct: లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ ముగిసింది. దీంతో హమ్మయ్య ఇక ఎన్నికల కోడ్(Election Code) ముగిసిందోచ్ అని చాలా మంది జనాలు ఊపిరి పీల్చుకుంటారు.
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయిన సుమారు రెండు నెలల తర్వాత తొలిసారి 14 మందికి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫెకెట్లను తొలి బ్యాచ్కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లా బుధవారంనాడు ప్రదానం చేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా 'ఏఎన్ఐ' వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది రొటీన్ జడ్జిమెంట్ కాదని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.
మీ ఫోన్కు ప్రతి రోజు పలు రకాల స్పామ్ కాల్స్(spam calls) వస్తున్నాయా. అయితే మీకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఎందుకంటే స్పామ్ కాల్స్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని మరికొన్ని రోజుల్లో అమలు చేయనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.
విపక్ష 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమ మద్దతుపై స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
ఎన్నికల్లో మాత్రమే గాంధీ కుటుంబసభ్యులు అమేథి, రాయబరేలి నియోజకవర్గాల్లో పర్యటిస్తారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాకం గాంధీ వాద్రా ఘాటుగా విమర్శించారు. ఆయన వాదన సత్యదూరమని అన్నారు. మహిళల కార్యకలాపాలపై అమిత్షా నిఘా వేయడం ఏమిటని నిలదీశారు.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు(investors) శుభవార్త వచ్చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(SEBI) మ్యూచువల్ ఫండ్ KYC నిబంధనలల్లో ఇటీవల మార్పులు చేసింది. దీంతో కోటి మందికి పైగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
బాలీవుడ్ నటి, లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. రూ.91 కోట్ల విలువచేసే ఆస్తులు తన పేరుతో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు.
'ఇండియా' కూటమి జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకూ పూర్తయిన నాలుగు విడతల పోలింగ్లో విపక్ష కూటమి స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.