Share News

LokSabha Elections: బస్సు బోల్తా: భద్రత సిబ్బందికి గాయాలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 02:22 PM

మధ్యప్రదేశ్‌ బేతుల్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మంది భద్రత సిబ్బంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తొలి దశ పోలింగ్ జరిగింది.

LokSabha Elections: బస్సు బోల్తా: భద్రత సిబ్బందికి గాయాలు

భోపాల్, ఏఫ్రిల్ 20: మధ్యప్రదేశ్‌ బేతుల్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మంది భద్రత సిబ్బంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తొలి దశ పోలింగ్ జరిగింది.

చిద్వారా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ నిర్వహణకు భద్రతా సిబ్బంది బందోబస్తు నిర్వహించి.. తిరిగి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. భోపాల్ - బేతుల జాతీయ రహదారిపై బరిత ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. భద్రతా సిబ్బందిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయని.. వారిని బేతుల్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.


Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. ఆ పని చేయొద్దని సీజేఐ చంద్రచూడ్ సూచన

కొద్ది పాటి గాయాలైన వారిని షాపుర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దారికి అడ్డుగా వచ్చిన ట్రక్కును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు. ఈ భద్రత సిబ్బంది స్వస్థలం రాజ్‌ఘర్‌కు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ఉన్నారు. వారిలో ఓ హోం గార్డు కూడా ఉన్నారని చెప్పారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 20 , 2024 | 02:28 PM