Share News

Chicken Shawarma: చికెన్ షావర్మా తిని.. 12 మంది ఆస్పత్రిపాలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 02:14 PM

చికెన్ షావర్మా తిని 12 మంది అసుపత్రి పాలైయ్యారు. ఈ ఘటన గోరెగావ్‌, సంతోష్ నగర్ ప్రాంతంలోని శాటిలైట్ టవర్స్‌లో చోటు చేసుకుంది. అయితే వారిలో 9 మంది అసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ముగ్గురు మాత్రం ఇంకా అసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బృహన్‌ ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. శుక్రు, శనివారాల్లో తీసుకున్న చికెన్ షావర్మా వల్ల వీరు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారని వారు చెప్పారు..

Chicken Shawarma: చికెన్ షావర్మా తిని.. 12 మంది ఆస్పత్రిపాలు

ముంబై, ఏప్రిల్ 29: చికెన్ షావర్మా తిని 12 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ముంబైలోని గోరెగావ్‌, సంతోష్ నగర్ ప్రాంతంలోని శాటిలైట్ టవర్స్‌లో చోటు చేసుకుంది. అయితే వారిలో 9 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ముగ్గురు మాత్రం ఇంకా అసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బృహన్‌ ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో తీసుకున్న చికెన్ షావర్మా వల్ల వీరు తీవ్ర అనారోగ్యం పాలయ్యారని వారు చెప్పారు.

Kanakamedala Ravindra: జగన్‌కు సంక్షేమం తెలియదు.. రాష్ట్రాన్ని దోచేశారు


LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్

మరోవైపు.. గత వారం పుణే జిల్లాలోని ఖేద్ తాలుకాలో ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. ఆహారం తీసుకున్న 50 మంది విద్యార్థులు అసుపత్రి పాలయ్యారు. దాంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారంతా కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో ఆహార పదార్ధాలను పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విద్యార్థులంతా జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షకు శిక్షణ తీసుకుంటున్నారు.

Read National News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 04:34 PM