భర్త కోసం భార్య ప్రచారం..
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:30 AM
ఎన్నికల్లో పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్ను గెలిపించాలని ఆయన భార్య రాధారాణి ప్రచారం చేపట్టారు.
దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని రాధారాణి ప్రచారం
పెదవేగి, ఏప్రిల్ 15: ఎన్నికల్లో పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్ను గెలిపించాలని ఆయన భార్య రాధారాణి ప్రచారం చేపట్టారు. బాబు వస్తేనే ప్రజల బతుకులు బాగవుతాయని అమె అన్నారు. న్యాయంపల్లిలో సోమవారం ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివ రించి ఓట్లు అభ్యర్ధించారు. చంద్రబాబు ముఖ్యమం త్రిగా ఉన్న సమయంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేవన్నారు. వైసీపీ పాలన దాడులు, దౌర్జన్యాలతో సాగుతోందని, వైసీపీని ఇంటి కి పంపించడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బొప్పన సుధాకర్, దావులూరి శ్రీనివాసరావు, కొమ్మిన సత్తిబాబు, కొడాలి రవిబాబు, కొమ్మిన శశికళ, దావు లూరి సునీత, రావూరి నాగమణి, పెద్దిన రాజ్యలక్ష్మి, కొమ్మిన లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
తనయుడి కోసం తండ్రి..
జంగారెడ్డిగూడెం: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ తండ్రి రాజారత్నం పట్టణంలో సోమవారం ప్రచారం చేపట్టారు. 15వ వార్డులో టీడీపీ నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సొంగా రోషన్ కు మార్ తండ్రి రాజారత్నం టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్ర మంలో పెనుమర్తి రామ్కుమార్, మండవ లక్ష్మణరా వు, చెరుకూరి ఽశ్రీధర్, తూటికుంట రాము, కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, నాయుడు శ్రీనివాస్, చేను ప్రసాద్, పాతూరి అంబేద్కర్, కంచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.