Share News

నేడు పవన్‌ కల్యాణ్‌ పర్యటన

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:48 PM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం గణపవరంలో, 30న కొయ్యలగూడెంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు

నేడు పవన్‌ కల్యాణ్‌ పర్యటన
గణపవరంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌

గణపవరం/ కొయ్యలగూడెం ఏప్రిల్‌ 29: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం గణపవరంలో, 30న కొయ్యలగూడెంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 29 తేదీ సోమవారం సాయంత్రం గణ పవరం మూడు రోడ్లు కూడలిలో సభ నిర్వహిస్తున్నారు. సభ ఏర్పాట్లను జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పత్స మట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీ నర్‌ చరణాల మాలతీరాణి పరిశీలించారు. గణపవరం మహాలక్ష్మి థియేటర్‌ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో హెలి ప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. పిఠాపురం నుంచి హెలి కాప్టర్‌పై బయలుదేరి 5 గంటలకు హెలిప్యాడ్‌లో దిగు తారు. అక్కడ నుంచి వారాహి వాహనంపై బొబ్బిలి వంతెన మీదుగా సెంటర్‌కు చేరుకుని బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తారు. ఎండల్లో పార్టీ శ్రేణులకు, అభిమా నులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

రేపు కొయ్యలగూడెంలో..

30వ తేదీన కొయ్యలగూడెంలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. మంగళవారం సాయంత్రం కొయ్యలగూడెం ప్రధాన సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పవన్‌ మాట్లాడనున్నారు. మండలంలోని గవర వరం సాయిరాకేష్‌ పాఠశాల వద్ద హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడకు చేరుకున్న పవన్‌కల్యాణ్‌ గవర వరం నుంచి కొయ్యలగూడెం సెంటర్‌ వరకు ర్యాలీగా వస్తారు. హెలిప్యాడ్‌ పనులను, వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలను సోమవారం పార్టీ నాయకులు పరిశీలిం చారు. మెట్ట ప్రాంతంలో మొట్టమొదటిగా పవన్‌ పర్యటన జరగనున్నందున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

నేడు షర్మిల పర్యటన

కొయ్యలగూడెం, ఏప్రిల్‌ 28: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సోమవారం కొయ్యలగూడెంలో పర్యటిస్తారని మండల కాంగ్రెస్‌ నాయకుడు దారం సత్తిరాజు తెలిపారు. కొయ్యలగూడెం కన్నాపురం రోడ్డులో సాయంత్రం రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్య కర్తలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Apr 28 , 2024 | 11:48 PM