Share News

కూటమి అభ్యర్థులకు విశేష స్పందన

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:57 PM

కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని వైసీపీ ఓటమి ఖాయమని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు.

కూటమి అభ్యర్థులకు విశేష స్పందన
గణపవరంలో ఓట్లు అభ్యర్థిస్తున్న గన్ని, పత్సమట్ల

టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు

గణపవరం, ఏప్రిల్‌ 28: కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని వైసీపీ ఓటమి ఖాయమని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఆదివారం గణపవరం, పిప్పరలో జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఆరాచక పాలన అంతం చేయాలన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో దగా మేనిఫెస్టో అని విమర్శించారు. ధర్మరాజు మాట్లాడుతూ ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని స్పష్టం చేశారు. పిప్పరలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు వాకపల్లి గ్రామానికి చెందిన 20 మందికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, దాట్ల సుబ్బరాజు, రంగరాజు, భీమవరపు ఏసురాజు, గణపవరరం టీడీపీ అధ్యక్షుడు కూసంపూడి సురేంద్రకుమారరాజు, టీడీపీ యువత అధ్యక్షుడు కాపారం చిన్న, టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు, పల్లి వెంకటేశ్వరరావు, సప్పా రాంబాబు, జనసేన నాయకులు తోట శ్రీనివాసరావు, కొలనువాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:57 PM