ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:13 AM
మండలంలోని చనుబండ గ్రామానికి చెందిన బర్రె ఆమని (30) అనే మహిళ, ఆమె ఇద్దరు పిల్లల అదృశ్యంపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
చాట్రాయి, ఏప్రిల్ 28: మండలంలోని చనుబండ గ్రామానికి చెందిన బర్రె ఆమని (30) అనే మహిళ, ఆమె ఇద్దరు పిల్లల అదృశ్యంపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భార్యాభర్తల గొడవల కారణంగా 3 రోజుల నుంచి కనిపించకుండా పోవటంతో పుట్టింటి వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం భార్యా భర్తల మధ్య గొడవ జరగటంతో భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఆమని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ నెల 25వ తేదీన చాట్రాయి పోలీస్స్టేషన్కు రాగా పోలీసులంతా ఎన్నికల బందోబస్తుకు వెళ్ళటంతో స్టేషన్లో ఎవరూ లేకపోవటంతో ఆమె అక్కడ నుంచి వెనుదిరిగింది. అయితే ఆమె పుట్టింటికి గానీ, అత్తింటికి గానీ వెళ్ళలేదు. ఆందోళన చెందిన పుట్టింటి వారు చాట్రాయి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కేసీహెచ్ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.