వైసీపీ డక్కవుట్కు ప్రజలు సిద్ధం
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:56 PM
వైసీపీ అరాచక పాలనను ప్రజలే డక్కవుట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఏలూరు ఆసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) అన్నారు.
ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి
ఏలూరుటూటౌన్, ఏప్రిల్ 28: వైసీపీ అరాచక పాలనను ప్రజలే డక్కవుట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఏలూరు ఆసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) అన్నారు. ఆదివారం కట్టా సుబ్బారావు తోటలో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొలువుతీరగానే ప్రజల కష్టాలన్ని తొలగిపోతాయన్నారు. జగన్ రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందన్నారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో పాత చింతకాయ పచ్చడిలా ఉందన్నారు. సాయంత్రం మీసాల అప్పన్నస్వామి గుడి వద్ద నుంచి ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. బ్రాహ్మణ్య సాధికార సమితి జిల్లా కన్వీనర్ ఎంబీఎస్ శర్మ, కడియాల విజయలక్ష్మి, రెడ్డి అప్పలనాయుడు, మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్, తదితరులు పాల్గొన్నారు.
ఫ మన్నాచర్చి మినిస్ర్టీస్ బిషప్ ఎం.ఎలీషారావు కూటమి అభ్యర్థి బ డేటి చంటిని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశీర్వదించారు. ఆదివారం మన్నాచర్చిలో పాస్టర్ ఎం.జ్యోతిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కొట్టు మనోజ్, జుంజు మోజెస్ తదితరులు పాల్గొన్నారు.