విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని చేయండి
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:28 AM
విజయమే లక్ష్యంగా ఈనెల 18 నుంచి విస్తృతంగా ప్రచారాన్ని చేయాల ని ఎన్డీఏ కూటమి విజయనగరం నియో జకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పిలుపు నిచ్చారు.
విజయ నగరం రూరల్: విజయమే లక్ష్యంగా ఈనెల 18 నుంచి విస్తృతంగా ప్రచారాన్ని చేయాల ని ఎన్డీఏ కూటమి విజయనగరం నియో జకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పిలుపు నిచ్చారు. సోమవారం విజయనగరం టీడీపీ కార్యా లయంలో నగరంలోని ఒకటి నుంచి 10 డివిజన్లకు చెందిన యూనిట్, బూత్ ఇన్చార్జిలు, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్సిక్స్ హామీలను బూత్ పరిధిలో నియమితులైన నలుగురు సభ్యులు ఓటర్లకు విస్తృతం గా వివరించాలన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాల న్నారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారు బాబు, కర్రోతు నర్సింగరావు, కాళ్ల గౌరీశంకర్ పాల్గొన్నారు.