Share News

దివ్యాంగులకు ఇంటి వద్దే విద్య

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:58 PM

దివ్యాంగ విద్యార్థులకు సమగ్రశిక్షావిద్యతోపాటు ఎస్‌కార్టు రవాణా, స్టైఫండ్‌, రీడర్‌ అలవెన్స్‌, ఇంటివద్దనే విద్యసదుపాయం కల్పిస్తున్నట్లు జిల్లా సహితవిద్య కోఆర్డినేటర్‌ సిరికి సూర్యారావు తెలిపారు. సోమవారం రామ భద్రపురం భవితకేంద్రంలో బొబ్బిలి నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగ పిల్లలకు ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా బొబ్బిలి, తెర్లాం, రామభద్రపురం,బాడంగి మండలాల్లోని 3 నుంచి 18 సంవత్సరాల్లోపు 150 మం ది దివ్యాంగులు పాల్గొనగా ట్రైసైకిళ్లు, ఎంఆర్‌ కిట్లు, వీల్‌చైర్లు, రోలేటర్స్‌ వంటి కిట్లకు వైద్యులు నాగిరెడ్డి రవిశంకర్‌, హిప్స్‌బా ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్‌ సిరికి సూర్యారావు, ఎంఈఓ ఆమిటి తిరుమల ప్రసాద్‌, ప్రత్యేకఉపాధ్యాయులు కొల్లి ఈశ్వరరావు, సునీల్‌, పాపారావు, కళావతి, శ్రీను, ఐఈఆర్‌టీలు రాజేశ్వరి, రవి, తేజశ్వని, సత్య, సూర్య, సరిత పాల్గొన్నారు.

 దివ్యాంగులకు ఇంటి వద్దే విద్య

రామభద్రపురం: దివ్యాంగ విద్యార్థులకు సమగ్రశిక్షావిద్యతోపాటు ఎస్‌కార్టు రవాణా, స్టైఫండ్‌, రీడర్‌ అలవెన్స్‌, ఇంటివద్దనే విద్యసదుపాయం కల్పిస్తున్నట్లు జిల్లా సహితవిద్య కోఆర్డినేటర్‌ సిరికి సూర్యారావు తెలిపారు. సోమవారం రామ భద్రపురం భవితకేంద్రంలో బొబ్బిలి నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగ పిల్లలకు ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా బొబ్బిలి, తెర్లాం, రామభద్రపురం,బాడంగి మండలాల్లోని 3 నుంచి 18 సంవత్సరాల్లోపు 150 మం ది దివ్యాంగులు పాల్గొనగా ట్రైసైకిళ్లు, ఎంఆర్‌ కిట్లు, వీల్‌చైర్లు, రోలేటర్స్‌ వంటి కిట్లకు వైద్యులు నాగిరెడ్డి రవిశంకర్‌, హిప్స్‌బా ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్‌ సిరికి సూర్యారావు, ఎంఈఓ ఆమిటి తిరుమల ప్రసాద్‌, ప్రత్యేకఉపాధ్యాయులు కొల్లి ఈశ్వరరావు, సునీల్‌, పాపారావు, కళావతి, శ్రీను, ఐఈఆర్‌టీలు రాజేశ్వరి, రవి, తేజశ్వని, సత్య, సూర్య, సరిత పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:58 PM