జనసేనలో చేరికలు
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:30 AM
ముక్కాం పంచాయతీ నుంచి వైసీపీకి చెందిన పలువురు కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీలో చేరారు.
భోగాపురం: ముక్కాం పంచాయతీ నుంచి వైసీపీకి చెందిన పలువురు కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీలో చేరారు. ముంజేరు సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపసర్పంచ్ మైలపల్లి మసీను, అతని అనుచరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి మాధవి కండువాలు వేసి ఆహ్వానించారు. ముక్కాం గ్రామం ఎటువంటి అభివృద్ధి చెందకపోవడంతో వైసీపీని వీడి.. జనసేనలో చేరినట్లు ఆమె తెలిపారు. పలువురు జనసైనికులు పాల్గొన్నారు.