Share News

కూటమితోనే అభివృద్ధి: జయకృష్ణ

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:31 AM

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.

కూటమితోనే అభివృద్ధి: జయకృష్ణ

భామిని: కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. సోమవారం మొట్టమొదటి సారిగా ఆయన భామిని మండలంలో ప్రచారం చేశారు. మండుటెండలో మహిళలు ఆయనకు హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గర్భాన సత్తిబాబు, రవినాయుడు, ఎం.జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పాలకొండ: కూటమి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. వారు సోమవారం పాలకొండలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భం గా నిర్వహించిన రోడ్‌షోలో అధికసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు పాల్గొన్నారు. వీరఘట్టం మండల కేంద్రానికి చెందిన సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి కూటమిలో చేరారు.

Updated Date - Apr 16 , 2024 | 12:31 AM